కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన ఇద్దరు కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు ఎస్బీఐ పోలీసు సాలరీ ప్యాకేజీ కింద ఒక్కో ఫ్యామిలీకి రూ. కోటి ఇన్సురెన్స్ చెక్లను సోమవారం ఎస్పీ రాజేశ్ చంద్ర, బ్యాంక్ అధికారులు అందించారు.
ఈ ఏడాది మార్చిలో గాంధారిలో కానిస్టేబుల్ వడ్ల రవికుమార్, ఏప్రిల్లో పిట్లంలో కె.బుచ్చయ్య చారి రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందారు. వీరి కుటుంబీలకు రూ. కోటి చొప్పున ఇన్స్రెన్ప్ చెక్లను అందించారు. అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఏవో లింగనాయక్, పర్యవేక్షణ అధికారి జమీల్అలీ పాల్గొన్నారు.
