కామారెడ్డి, వెలుగు : చైనా మాంజా అమ్మకాలు పూర్తిగా నిషేధమని, నైలాన్ దారాలు ప్రాణాంతకమని, సాధారణ దారాలతోనే పతంగులు ఎగుర వేయడం సురక్షితమని ఎస్పీ రాజేశ్చంద్ర సూచించారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా పతంగులు అమ్మే షాపులు, ఇతర షాపులు కలిపి 157 చోట్ల పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చైనా మాంజాతో పర్యావరణానికి హాని కలుగుతోందన్నారు. వెహికల్స్పై వెళ్లే వాళ్లకు, పక్షులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. కరెంట్ స్తంభాలకు దూరంగా, బహిరంగ ప్రదేశాల్లో పతంగులు ఎగురవేసుకోవాలన్నారు. ఎక్కడైనా చైనా మాంజా అమ్మినా, నిల్వ ఉంచినా పోలీస్ కంట్రోల్ రూమ్ నం. 8712686133కి సమాచారం ఇవ్వాలని సూచించారు.
