- రా. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్లో
కొలంబో: టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కోసం శ్రీలంక రెడీ అయ్యింది. బుధవారం జరిగే గ్రూప్–2 మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఇంగ్లండ్తో జరిగిన తొలి మ్యాచ్లో 147 రన్స్ను ఛేదించలేకపోయిన లంకేయులు ఈ మ్యాచ్పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. స్లో బౌలర్లపై తమ బ్యాటింగ్ను మెరుగుపర్చుకోవాలని భావిస్తున్నారు. లంక బ్యాటర్లు షాట్ల ఎంపికలో పదేపదే తప్పులు చేస్తున్నారు. దీన్ని కచ్చితంగా సరి చేసుకోవాలి. బ్యాటింగ్లో నిశాంక ఒక్కడే ఎక్కువ భారం మోస్తుండటం మైనస్గా మారింది. మిగతా బ్యాటర్లు కూడా తలా ఓ చేయి వేస్తే భారీ స్కోరును ఆశించొచ్చు. ఇక బౌలింగ్లో లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే ఆకట్టుకుంటున్నాడు. మరోవైపు పాకిస్తాన్తో తొలి సూపర్–8 మ్యాచ్ రద్దవడంతో ఒకే పాయింట్తో నిలిచిన కివీస్ ఈ పోరులో గెలిచి సెమీస్ రేసులో నిలవాలని చూస్తోంది.
