బోధన్, వెలుగు : బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్అండ్డ్రైవ్లో బోధన్ పట్ణణంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన షేక్ షబ్బీర్ పట్టుబడ్డాడు. మంగళవారం బోధన్పోలీసులు స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హాజరుపర్చగా ఐదు రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు.
