నిజామాబాద్, వెలుగు : అర్హులైన మైనారిటీలకు సంక్షేమ పథకాలు అందేలా చొరవ చూపాలని స్టేట్ మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ కోరారు. మంగళవారం నిజామాబాద్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్యతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు. మైనారిటీ విద్యా సంస్థలో వంద శాతం అడ్మిషన్లు జరిగేలా ప్లాన్ చేయాలన్నారు. జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి తదితరులు ఉన్నారు.
పుష్కరాల కోసం 15 ఘాట్లు వచ్చే ఏడాది జిల్లాలో జరిగే గోదావరి పుష్కరాల కోసం 15 చోట్ల ఘాట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. భక్తులు పుణ్యస్నానాలు చేసే కందకుర్తి, తాడ్బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్ పాకల, దోమ్ చంద, గుమ్మిర్యాల తదితర 15 ప్రాంతాలను గుర్తించామన్నారు. సీపీ సాయిచైతన్య, అడిషనల్కలెక్టర్ కిరణ్కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, ఏసీపీ ప్రకాశ్ తదితరులు ఉన్నారు.
కామారెడ్డి కలెక్టరేట్లో...
కామారెడ్డి : అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని స్టేట్ మైనార్టీ కమిషన్చైర్మన్ తారిక్ అన్సారీ అధికారులకు సూచించారు. మంగళవారం కామారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఇతర అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. బాన్సువాడలో ఇటీవల జరిగిన సంఘటనపై చర్చించారు. బాన్సువాడలో శాంతి భద్రతలను నెలకొల్సిన అధికారులు, పోలీసులను అన్సారీ అభినందించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, అధికారులు ఉన్నారు.
