
- అభినందించిన ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డిటౌన్, వెలుగు: ఈ నెల 7,9 తేదీల్లో కరీంనగర్ లో జరిగిన 2వ జోనల్ పోలీస్ డ్యూటీ మీట్లో కామారెడ్డి జిల్లాకు 11 పతకాలు వచ్చినట్లు ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపారు. పతకాలు సాధించిన అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. పతకాలు సాధించిన వారిలో బి.ఆంజనేయులు ( ఎస్సై-గాంధారి), కె.విజయ్ ( ఎస్సై- మద్నూర్), ఎస్.లక్ష్మీనారాయణ, ఎ.చిరంజీవి, పి.రామచంద్రం, పి.ఎల్లారెడ్డి ఉన్నారు. వృత్తి నైపుణ్యాన్ని గుర్తించేందుకు పోలీసు డ్యూటీ మీట్ దోహాదపడుతుందన్నారు. సీఐలు సంతోష్కుమార్, నవీన్కుమార్ పాల్గొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా పని చేయాలి
సదాశివనగర్, వెలుగు: ప్రజల అవసరాలకు అనుగుణంగా పోలీసులు పని చేయాలని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం సదాశివనగర్ పోలీస్ స్టేషన్, సర్కిల్ ఆఫీస్ను ఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, అ ధికారులు, సిబ్బందితో మాట్లాడారు. డయల్ 100కు వెంటనే స్పందించి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. చోరీలు జరగకుండా చూడాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలు తగ్గించాలన్నారు.
రెగ్యులర్గా గ్రామాలను విజిట్ చేయాలన్నారు. సైబర్ మోసాలు, మూఢనమ్మకాల నిర్మూలన, బాల్యవివాహాలు తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై జాప్యం చేయవద్దన్నారు. సీఐ సంతోష్కుమార్, ఎస్సై పుష్పరాజ్ ఉన్నారు.