
- ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు 136
- గతంలో టార్గెట్కు 70 శాతం దాటని లోన్లు
కామారెడ్డి, వెలుగు : వార్షిక రుణ ప్రణాళికలో వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. ప్లాన్లో 42. 44 శాతం క్రాప్ లోన్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది క్రాప్ లోన్లకు రూ.3,482 కోట్లు కేటాయించింది. వ్యవసాయాధారిత జిల్లా అయినందున విరివిగా లోన్లు ఇవ్వాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బ్యాంకర్లకు సూచించారు. జిల్లాలో ఈ వానాకాలం 5,17,677 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
ప్రతి ఏడాది జిల్లాలో వానాకాలం సీజన్ 5 లక్షలకుపైగా ఎకరాలు, యాసంగి 3.20 లక్షల ఎకరాల వరకు పంటలు సాగవుతున్నాయి. వానాకాలం 60 శాతం, యాసంగి 40 శాతం క్రాప్ లోన్లు ఇవ్వాలని జిల్లాయంత్రాంగం టార్గెట్ పెట్టుకుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు సంబంధించి 136 బ్యాంక్ శాఖలు ఉన్నాయి. ఆయా బ్యాంక్ శాఖలు తమ పరిధిలోని గ్రామాల రైతులకు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ప్రధానంగా వరి, మక్క, సోయా, పత్తి, చెరుకు సాగవుతున్నాయి.
ఈ ఏడాది టార్గెట్
2025-, 26లో జిల్లాలో వార్షిక రుణ ప్రణాళిక రూ. 8,204 కోట్లు కాగా, వ్యవసాయ రంగానికి రూ.5,666 కోట్లు కేటాయించారు. ఇందులో క్రాప్ లోన్లు రూ.3,482 కోట్లుగా నిర్ణయించారు. మొత్తం 2,45,091 రైతులకు లోన్లు ఇవ్వనున్నారు. పరిస్థితులను బట్టి ఎక్కువ మంది కి లోన్లు ఇవ్వవచ్చు.