కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లాలో జనవరి 7 నుంచి 9 వరకు నిర్వహించే రాష్ర్టస్థాయి సైన్స్ ఫెయిర్, ఇన్స్ఫైర్అవార్డుకు సంబంధించి ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. రాష్ర్టస్థాయి సైన్స్ ఫేయిర్ ఏర్పాట్లపై సోమవారం కలెక్టరేట్లో ఆయా శాఖల అధికారులతో మీటింగ్ నిర్వహించి మాట్లాడారు.
రాష్ర్టస్థాయి ప్రోగ్రాంలో అన్ని శాఖల అధికారులు భాగస్వాములై సక్సెస్ చేయాలన్నారు. వివిధ శాఖల అధికారులు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఏఎస్పీ చైతన్యారెడ్డి, డీఈవో రాజు తదితరులు పాల్గొన్నారు.
