- 4 నియోజకవర్గాల్లో రూ. 10 కోట్ల 92 లక్షలు చెక్కుల అందజేత
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు రెండో విడతగా వడ్డీ లేని రుణాల పంపిణీ మంగళవారం అట్టహాసంగా జరిగింది. 4 నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చెక్కులను అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో 3,506 సంఘాలకు రూ.3 కోట్ల 25 లక్షలు పంపిణీ చేశారు. భిక్కనూరు మండల కేంద్రంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, ఎమ్మెల్సీ, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్, అడిషనల్ కలెక్టర్, డీఆర్డీవో పాల్గొన్నారు.
బాన్సువాడ నియోజకవర్గంలో 1,295 సంఘాలకు రూ. కోటి 13 లక్షలు వచ్చాయి. నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి, అగ్రోస్ చైర్మన్ కాసుల బాల్రాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి కలిసి సంఘాల ప్రతినిధులకు చెక్కులను అందజేశారు. ఎల్లారెడ్డి నియోజక వర్గంలోని సంఘాలకు రూ. 3 కోట్ల 78 లక్షల చెక్కులను అందజేయగా, గాంధారి మండల కేంద్రంలో ఎమ్మెల్యే మదన్మోహన్రావు, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ చెక్కులను అందజేశారు. జుక్కల్ నియోజకవర్గంలో 3,241 సంఘాలకు రూ.2 కోట్ల 76 లక్షలు వచ్చాయి.
