
చండీగఢ్/న్యూఢిల్లీ: ప్రతి మహిళ గౌరవానికి అర్హురాలేనని సినీ నటి కంగనా రనౌత్ అన్నారు. ఇందుకు వారి ప్రొఫెషన్, బ్యాక్గ్రౌండ్తో సంబంధంలేదని చెప్పారు. బీజేపీ అధిష్టానం హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి రనౌత్ ను బరిలోకి దింపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేత సుప్రియా శ్రీనతే తన సోషల్మీడియా అకౌంట్లలో రనౌత్ను కించపరిచేలా పోస్టులు పెట్టారు. సుప్రియాతో పాటు ఆ పార్టీ నేత హెచ్ఎస్ అహిర్అకౌంట్లోనూ పోస్ట్చేశారు. ఈ అంశం కాస్తా తీవ్ర దుమారం రేపింది. ఈ పోస్టుపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను డిమాండ్ చేశారు. కాగా, అంశంపై కంగనా స్పందించారు. మంగళవారం చండీగఢ్ ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘టీచర్, నటి, జర్నలిస్ట్, రాజకీయ నేత, సెక్స్ వర్కర్.. ఏ వృత్తిలో ఉన్నా సరే ప్రతీ మహిళ గౌరవానికి అర్హురాలే. ప్రపంచవ్యాప్తంగా "ఛోటా కాశీ"గా పిలవబడే మండిపై కాంగ్రెస్ నేతల నీచమైన వ్యాఖ్యల వల్ల నేను చాలా బాధపడ్డాను” అని కంగన అన్నారు.