
హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బాలీవుడ్ నటి కంగన రనౌత్ (Kangana Ranau) కు ఆ రాష్ట హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ సీటు నుుంచి పోటీకి తాను దాఖలు చేసిన నామినేషన్ ను అన్యాయంగా తిరస్కరించారంటూ కిన్నౌర్ కు చెందిన లాయక్ రామ్ నేగి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కౌంట ర్ దాఖలు చేయాలంటూ కంగనకు నోటీజులు జారీ చేసింది.ఆగస్టు 21లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. మండిలో కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాధిత్యసింగ్ ను భాజపా తరఫున పోటీ చేసిన కంగనా రనౌత్ 74,755 ఓట్ల తేడాతో ఓడించారు.
అన్యాయంగా తన నామినేషన్ తిరస్కరించినందున కంగన రౌనత్ ఎన్నికను పక్క న పెట్టాలని పిటిషనర్ లాయక్ రామ్ నేగి హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 21న కంగన హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది.