ముంబై: సరైన టైమ్లో ట్యాక్స్ చెల్లించకపోవడంతో పెండింగ్ అమౌంట్పై ప్రభుత్వం వడ్డీ వేయ డాన్ని నటి కంగనా రనౌత్ స్వాగతించారు. షూటింగ్లు ఆగిపోవడంతో ఆదాయం లేక ఈసారి సరైన సమయానికి ట్యాక్స్ కట్టలేకపోయానని చెప్పారు. ఈమేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘నా మొత్తం ఆదాయంలో 45% ట్యాక్స్ కడుతున్నాను. నేను అత్యధికంగా పన్ను చెల్లించే నటిని. కానీ పని లేకపోవడం వల్ల గత ఏడాది ట్యాక్స్లో సగం అమౌంట్ ఇప్పటిదాక చెల్లించలేకపోయా. నా జీవితంలో పన్ను చెల్లించడం ఆలస్యం కావడం ఇదే ఫస్ట్ టైమ్’ అని అన్నారు.