బాలీవుడ్ లో డ్రగ్ కంట్రోల్ బ్యూరోను అనుమతించాలని కోరుతూ హీరోయిన్ పీఎంఓ ను కోరింది.
దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్టరీ పై విచారణ కొనసాగుతుంది. విచారణలో భాగంగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ తరుపు లాయర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రియా, సుశాంత్కు తెలియకుండా అతనికి నిషేధించిన డ్రగ్స్ను ఇచ్చిందని అన్నారు. సుశాంత్కు తెలియకుండా కొన్ని నిషేధిత డ్రగ్స్ను ఆయనకు ఇచ్చారు. ఇదే అతడు చనిపోవడానికి కారణమయ్యిందన్నారు.
ఈ నేపథ్యంలో సుశాంత్ మరణంపై తొలినుంచి అనుమానం వ్యక్తం చేస్తున్న హీరోయిన్ కంగాన రౌనత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో నార్కోటిక్ బ్యూరోను అనుమతించాలని పీఎంఓను కోరుతూ ట్వీట్ చేసింది. డ్రగ్ కంట్రోల్ బ్యూరోను అనుమతిస్తే చాలామంది బాగోతాలు బట్టబయలవుతాయని ట్వీట్ లో పేర్కొంది.