చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. గర్భగుడిలోని వరసిద్ది వినాయకుడి మూలవిరాట్ విగ్రహం ఫోటో నెటింట్లో వైరల్ గా మారింది. ఏప్రిల్ 11వ తేదీ మంగళవారం వైసీపీ నేత, PKM UDA చైర్మన్ నల్లబాల వెంకటరెడ్డి యాదవ్ దంపతులు కాణిపాకం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోని వినాయక స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
అయితే ఈ సమయంలో వెంకటరెడ్డి యాదవ్ అనుచరులు గుడిలో మూలవిరాట్ విగ్రహం ఫోటోలు తీశారు. వినాయక స్వామి మూలవిరాట్ గా ఉన్న ఫోటోలను ప్రవీణ్ చిన్న అనే వ్యక్తి తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు. స్వామి వారి మూలవిరాట్ ఫోటోలు బయటకు రావడంతో హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహిస్తున్నారు. గుడిలోకి సెల్ ఫోన్ ఎలా అనుమతిస్తారంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేత వెంకటరెడ్డి యాదవ్ ఆయన అనుచరులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
