కన్నప్ప హార్డ్​ డిస్క్​ మిస్సింగ్​ కేసు..ఎగ్జిక్యూటివ్ ​ప్రొడ్యూసర్​కునోటీసులు

కన్నప్ప హార్డ్​ డిస్క్​ మిస్సింగ్​ కేసు..ఎగ్జిక్యూటివ్ ​ప్రొడ్యూసర్​కునోటీసులు

హైదరాబాద్​సిటీ, వెలుగు: మంచు విష్ణు నటించిన 'కన్నప్ప'  సినిమా హార్డ్ డిస్క్ మిస్సింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్​కు పోలీసులు నోటీసులిచ్చారు.  అనుమతి లేకుండా హార్డ్ డిస్క్ తీసుకెళ్లారని విజయ్ ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ‘కన్నప్ప' సినిమా కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ ముంబై  స్టూడియో నిర్వాహకులు  కొరియర్ ద్వారా ఫిల్మ్ నగర్ లోని విజయ్ కుమార్ ఆఫీసుకు పంపారు.

ఈ పార్శిల్​ను మే 25న ఆఫీస్ బాయ్ రఘు తీసుకున్నాడు. అతను ఈ విషయం ఎవరికీ చెప్పకుండా చరిత అనే యువతికి అప్పగించాడు. ఆ రోజు నుంచి ఇద్దరూ తప్పించుకుని తిరుగుతున్నారు. ఇదే విషయంపై విజయ్ కుమార్ ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తులో భాగంగా వివరాలు సేకరిస్తున్నారు. చోరీకి సంబంధించిన వివరాలు తెలిపాలని పోలీసులు విజయ్​కుమార్​కు నోటీసులు ఇచ్చారు. రెండు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ కేసులో మరికొంత మందిని పోలీసులు విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.