శాయంపేట, వెలుగు: గదులు సరిగ్గా లేకపోవడంతో గ్రౌండులోనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం ఆరెపల్లిలో సర్పంచ్తో పాటు రెండు వార్డులకు బుధవారం ఎన్నికలు జరిగాయి. అక్కడ ప్రైమరీ స్కూల్ లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. స్కూల్లో ఒకే గది ఉంది. ఆరు వార్డులు ఉన్న గ్రామంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఈ గది సరిపోకపోవడంతో గ్రౌండులో టెంట్లు వేసి పోలింగ్కు ఏర్పాట్లు చేశారు.
