- 365 స్టాల్స్ ఏర్పాటు
- మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు
- సెల్ఫీ స్పాట్గా ‘చార్మినార్’
హైదరాబాద్ సిటీ, వెలుగు: లోకకవి అందెశ్రీ పేరుతో నగరంలో పుస్తకాల పండుగ మొదలుకాబోతోంది. డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్స్టేడియంలో నేషనల్బుక్ఫెయిర్సందడి చేయబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం హైదరాబాద్ బుక్ ఫెయిర్అధ్యక్షుడు యాకూబ్షేక్, సెక్రటరీ ఆర్వాసు వెల్లడించారు.
ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 9 గంటల వరకు బుక్ఫెయిర్ఉంటుందని చెప్పారు. గతేడాది దాదాపు 10 మంది లక్షల మంది బుక్ ఫెయిర్ను సందర్శించగా.. ఈ ఏడాది 12 నుంచి 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.
స్టూడెంట్స్, టీచర్స్కు ఫ్రీ
బుక్ఫెయిర్లో గతేడాది 360 స్టాల్స్ ఏర్పాటు చేయగా.. ఈసారి 365 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బుక్ఫెయిర్ఎంట్రీ ఫీజు రూ.10గా నిర్ణయించారు. అయితే, విద్యార్థులకు, వారితో వచ్చిన టీచర్లు గుర్తింపు కార్డు చూపిస్తే ఉచిత ప్రవేశం ఉంటుంది.
ఆవిష్కరణకు వేదికలు
పుస్తకాల ఆవిష్కరణకు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు బుక్ఫెయిర్లో ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు. బుక్ఫెయిర్ప్రాంగణానికి లోకకవి అందె శ్రీ పేరును, ప్రధాన వేదికకు అనిశెట్టి రజిత పేరు, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు కొంపల్లి వెంకట్గౌడ్పేరు పెట్టారు. రజిత, వెంకట్గౌడ్ వేదికలపై 10 రోజుల్లో సుమారు 50 కొత్త పుస్తకాలు రిలీజ్కానున్నాయి.
తెలంగాణ వంటకాలతో..
బుక్ ఫెయిర్కు వచ్చేవారి కోసం తెలంగాణ వంటకాలతో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ధరలు అందుబాటులో ఉంటాయని, నాణ్యతలో రాజీ పడడం లేదన్నారు. ఈ సారి ప్రధాన వేదికకు ఎదురుగా చార్మినార్ మోడల్ ఏర్పాటు చేసి దాన్ని సెల్ఫీ స్పాట్గా మలిచామన్నారు. సందర్శకులను ఇది కట్టిపడేస్తుందన్నారు. చిన్నారులు ఆడుకోవడానికి కిడ్స్ ప్లే ఏరియాతోపాటు తల్లిదండ్రులకు సిట్టింగ్ ఏరియాను సిద్ధం చేసినట్టు చెప్పారు.
రోజూ బాలోత్సవ్..
బుక్ఫెయిర్వేదికగా ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4గంటల వరకు బాలోత్సవ్కార్యక్రమాలు నిర్వహించనున్నారు. యువతకు డ్రగ్స్నివారణపై, మొబైల్వాడకం వల్ల నష్టాలను, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా స్కిట్ల్స్వేస్తున్నట్టు తెలిపారు. ప్రముఖ రచయితలను, సాహితీవేత్తలను ఆహ్వానించి వారిని ప్రభావితం చేసిన పుస్తకాలపై చర్చలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 11 రోజుల పాటు జరిగే ఈ సాహిత్య కార్యక్రమంలో సాహితీ ప్రియులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
15 లక్షల మందికి తగ్గ ఏర్పాట్లు
నగరంలో 38 ఏండ్లుగా హైదరాబాద్బుక్ఫెయిర్జరుగుతోంది. ఏటా లక్షలాది మంది పుస్తకప్రియులు ఈ బుక్ఫెయిర్ను సందర్శిస్తున్నారు. ఈ ఏడాది11 రోజుల్లో సుమారు15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే స్టాళ్ల ఏర్పాట్లు, వేదిక నిర్మాణం పూర్తయ్యింది. పుస్తక ప్రియులు ఈ పండుగలో పాల్గొని, విజయవంతం చేయాలి. - యాకూబ్ షేక్, వాసు,బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్, సెక్రటరీ
