కాంతారా ముందు ఏం జరిగింది.. సీక్వెల్ కోసం కొత్త ట్విస్ట్

కాంతారా ముందు ఏం జరిగింది.. సీక్వెల్ కోసం కొత్త ట్విస్ట్

గత సంవత్సరం కన్నడ ఇండస్ట్రీలో రిలీజై పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించిన మూవీ "కాంతారా". డివోషినల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి.. ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకుల నుండి వచ్చిన ఆధారణ చూసి సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఇక త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుంది.

అయితే అందరూ భావిస్తున్నట్టుగా ఇది  సీక్వెల్ కాదు..  ప్రీక్వెల్. అంటే కాంతారా మూవీలో మనం చూసినదానికి ముందు ఏం జరిగింది అనేది ఈ సినిమా లో చూపించబోతున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ ప్రీక్వెల్ లో గ్రామస్తుల మధ్య అనుబంధాలు, గుళిగ దైవం రాజు గురించి చూపిస్తారట. గ్రామస్తులతో పాటు భూమిని రక్షించడానికి రాజు ఏం చేశాడనేది తెర మీద ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం.

తాజాగా ఈ సినిమా కు సంబంధించిన మరో క్రేజీ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది.ఈ మూవీ ప్రీక్వెల్ డ్రాఫ్ట్ ని రిషబ్ శెట్టి ఇప్పటికే పూర్తి చేశాడట. ఈ విషయంలో చిత్ర బృందం సంతోషంగా ఉందట. ఫైనల్ వర్షెన్ ని లాక్ ఛేయడానికి ముందు ఏమైనా మార్పులు చేయడం పై ప్రస్తుతం సమయం కేటాయిస్తున్నాడట రిషబ్. మొదటి భాగం భారీ విజయం సాధించిన నేపధ్యంలో.. ఈ ప్రీక్వెల్ కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. మొదటి భాగం కోసం 16 కోట్లు ఖర్చు చేసిన మేకర్స్... ఈ ప్రీక్వెల్ కోసం దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు చేయనున్నారట. హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది.