పెండ్లిలో  పోలుపోసిన కార్పొరేటర్

 పెండ్లిలో  పోలుపోసిన కార్పొరేటర్

తిమ్మాపూర్​, వెలుగు: పెండ్లిలో పోలు పోసి తన వృత్తిని విలువ చాటాడు కరీంనగర్​బల్దియా అలుగునూర్​ కార్పొరేటర్​కాల్వ మల్లేశం. గ్రామానికి చెందిన పోరండ్ల సింగిల్​విండో మాజీ చైర్మన్​ సింగిరెడ్డి స్వామిరెడ్డి -– శ్యామల దంపతుల చిన్న కొడుకు నిఖిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి వివాహం బుధవారం ఓ ఫంక్షన్​ హాలులో జరిగింది.

ఈ వేడుకలో కార్పొరేటర్​ కాల్వ మల్లేశం(రజక కులం) సంప్రదాయాలకు విలువనిస్తూ లగ్గానికి పోలు పోశారు. సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్న కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పలువురు ప్రత్యేకంగా అభినందించారు.