
కరీంనగర్ క్రైమ్, వెలుగు: కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లకు టెక్నాలజీ వినియోగంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. బుధవారం శిక్షణా తరగతులను సీపీ పరిశీలించి మాట్లాడారు. పోలీసులు వినియోగించే వివిధ సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లపై శిక్షణ కొనసాగుతోందన్నారు.