తాను సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తోన్న వార్తాలను కర్ణాటక సీఎం యడ్యూరప్ప కొట్టిపారేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న యడ్యూరప్ప.. నిన్న ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిపై మాత్రమే చర్చించినట్లు ఆయన తెలిపారు. ఆగష్టులో తాను మళ్లీ ఢిల్లీకి వస్తానని ఆయన అన్నారు. త్వరలోనే రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నడ్డాతోనూ సమావేశమవుతానని చెప్పారు. మెకేదతు ప్రాజెక్టు అనుమతి కోసం జల్ శక్తి మంత్రిని కూడా కలుస్తానని యడ్డీ చెప్పారు.
అయితే కొన్ని రోజులుగా కర్ణాటక ముఖ్యమంత్రిని మారుస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా యడ్యూరప్ప వ్యతిరేక వర్గం ఈ వార్తాలను మరింత ప్రచారం చేస్తోంది. ప్రస్తుతం యడ్యూరప్ప ఢిల్లీ పర్యటనలో ఉండడంతో దీనికి మరింత బలం చేకూరింది. కానీ ఈ వార్తాలను యడ్యూరప్ప ఎప్పటికప్పుడూ కొట్టిపారేస్తున్నారు. ఇటీవల ఆ రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ అరున్ సింగ్ కూడా సీఎం మార్పు లేదని తేల్చి చెప్పారు.