
కశ్మీర్ ఫైల్స్(Kashmir files) సినిమాకు జాతీయ అవార్డు రావడంపై ఆ చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్(Abhishesh agarwal) ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంధర్బంగా మాట్లాడిన ఆయన.. మా సినిమాకు జాతీయ అవార్డు రావాలని మేమేమి కేంద్ర ప్రభుత్వాన్నీ కోరలేదు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాను ఆదరించారు కాబట్టే జాతీయ అవార్డు వరించింది. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోవాల్సిన అవసరంలేదు. నిజాన్ని నిర్భయంగా చూపించే ఎలాంటి సినిమాలకు మరిన్ని అవార్డ్స్ రావాలని ఆయన తేలిపోయారు.
అయితే.. కశ్మీర్ ఫైల్స్ సినిమాకు జాతీయ అవార్డు ప్రకటించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన కామెంట్స్ చేశారు. వివాదాస్పద సినిమా కశ్మీర్ ఫైల్స్కు జాతీయ అవార్డు ఎలా ఇస్తారు. అవార్డులు అనేవి రాజకీయాలను ప్రభావితం చేయకూడదు. ప్రేక్షకుల నుండి పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొన్న సినిమాలను ఎలా పరిగణలోకి తీసుకున్నారు. ఎన్నికల సమయం కాబట్టి కావాలనే ఈ సినిమాకు అవార్డు ప్రకటించి కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.