జమ్మూకాశ్మీర్ లో కశ్మీరీ పండిట్ల ఆందోళన 

జమ్మూకాశ్మీర్ లో కశ్మీరీ పండిట్ల ఆందోళన 

జమ్మూకాశ్మీర్ లో కశ్మీరీ పండిట్లు ఆందోళన చేస్తున్నారు. ఉగ్రవాదుల నుంచి తమకు ముప్పు ఉందని.. రక్షణ కల్పించాలని కోరారు. ప్రధానమంత్రి పునరావాస ప్యాకేజీ కింద పనిచేస్తున్న 56 మంది కశ్మీరీ పండిట్ ఉద్యోగుల బదిలీ జాబితా లీక్ కావడంపై ఆందోళన వ్యక్తం చేశారు.  

తమ జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోందని కశ్మీర్ పండిట్లు మండిపడ్డారు.ఇప్పటికే చాలా మంది పండిట్లు కశ్మీర్ లోయను విడిచి వెళ్తున్నారని తెలిపారు. రక్షణ కల్పించకుంటే పోరాటం ఉధృతం చేస్తామన్నారు.