
- బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్లే డిసైడ్ చేస్తరు
- ప్రతి ఎన్నికలో బీజేపీ వాళ్లు కుమ్మక్కయ్యారు
- ఈ విషయం ఎవరైనా చెబితే సస్పెండ్ చేస్తారని కామెంట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చేసిన చిచ్చాట్లో మాట్లాడిందంతా నిజమేనని తాను భావిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ బీజేపీ వాళ్లు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి నిలబడాలి అనేది బీఆర్ఎస్ వాళ్లే డిసైడ్ చేస్తారని, డిసైడ్ చేసేది తమ పార్టీ వాళ్లు కాదని ఆరోపించారు. గతంలోనూ ఇదే జరిగిందని, దీంతో బీజేపీ నష్టపోయిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడో అధికారంలోకి రావాల్సి ఉందని, కానీ ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్లు కుమ్మక్కు అయిపోయారని, దీంతో బీజేపీకి చాలా నష్టం జరిగిందని చెప్పారు. ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసని, కానీ ఎవరు బయటకు చెప్పబోరని తెలిపారు.
ఒకవేళ చెబితే వాళ్లు సస్పెండ్ అయిపోతారని వెల్లడించారు. దీంతోనే కార్యకర్తలు, నేతలు గానీ పాపం నోరు మూసుకొని కూర్చుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, పేద ప్రజలను చంపేందుకు ఓ వర్గానికి చెందిన టెర్రరిస్టులు కుట్రలు చేశారని, వారిని పోలీసులు పట్టుకున్నారని మరో ప్రకటనలో తెలిపారు. టెర్రరిస్టులకు ఎంఐఎం సహకరిస్తున్నదని ఆయన ఆరోపించారు. టెర్రిరిస్టుల హిట్లిస్టులో ఉన్న నేతలకు ఎన్ఐఏ, పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.