కేసీఆర్, ఉత్తమ్ మంచి దోస్తులు: ఎంపీ అర్వింద్

కేసీఆర్, ఉత్తమ్ మంచి దోస్తులు: ఎంపీ అర్వింద్

సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి స్నేహితులన్నారు నిజామాబాద్ ఎంపీ అర్వింద్. వారిద్దరు కలిసి మంచి అవగాహనతో ముందుకెళ్తున్నారని అన్నారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థులు పోలింగ్ కు ముందే చేతులెత్తేయడం ఇందుకు నిదర్శనమన్నారు. అన్ని వర్గాల వారు టీఆర్ ఎస్ పాలనపై నిరాశతో ఉన్నారని అన్నారు.  చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందని టీఆర్ఎస్,కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు  అర్వింద్.