కేసీఆర్ ప్రశ్నలకు ప్రజలే బదులిస్తారు

కేసీఆర్ ప్రశ్నలకు ప్రజలే బదులిస్తారు

ఇవాళ్టి నుంచి కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైందని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. మోడీ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ కు నిద్రపట్టదని, రోడ్డుపైకి రావాల్సిన అవసరం కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు.  ఆదివారం సాయంత్రం మోడీ విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందని ప్రశ్నిస్తున్న కేసీఆర్ కు త్వరలో ప్రజలే సమాధానం చెబుతారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రజలు ఎంతోమంది లబ్ధి పొందారని గుర్తు చేశారు. రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో ఎక్కడ చూసినా బీజేపీ.. బీజేపీ.. బీజేపీ అనే పదమే వినిపిస్తోందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం తథ్యమని జితేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.