కాంగ్రెస్, బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. కేసీఆర్.. కేటీఆర్ గజదొంగలు అంటూ.. మూడు నెలల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతుందన్నారు. ధరణి విషయంలో కోర్టులో పిల్ వేయకుండా ప్రభుత్వం తనను అడ్డుకుంటుందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ 119 స్థానాల్లో పోటీ చేసి 79 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేఏ పాల్ తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి భయం పట్టుకుందని జమిలి ఎన్నికలు పెడుతున్నారన్నారు. గద్దర్ ఆశయ సాధన కోసం అందరం కలిసి పనిచేయాలని అన్నారు. సెప్టెంబర్ 7 వ తేదీన హరిహర కళాభవన్ లో ప్రజాశాంతి మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. షర్మిలకు ఓటు అడిగే హక్కు లేదన్న కేఏ పాల్ .. మంత్రి మల్లారెడ్డి పిచ్చోడంటూ ఆయనకు సమాజంపై అవగాహన లేదన్నారు. ఆంధ్రాలో పవన్ ప్యాకేజీ స్టార్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరూ సీట్ల కోసం అగ్రకులాల దగ్గరకు వెళ్లకండి.. నాదగ్గరకు రండి .. నేను సీట్లు ఇస్తానని కేఏ పాల్ అన్నారు.