
- లోక్సభ కోడ్ వచ్చేలోగా గ్యారంటీలన్ని అమలు చేయాలి: నామ నాగేశ్వర్రావు
హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ఎన్నికల కోడ్వచ్చేలోపే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, హామీలన్ని అమలు చేయాలని ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వర్రావు అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఖమ్మం లోక్సభ సన్నద్ధత సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. హామీలు అమలు చేయకుంటే కాంగ్రెస్ప్రభుత్వాన్ని ప్రజలే నిలదీస్తారన్నారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని, ఖమ్మం జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. అయినా ప్రజలు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా తీర్పునిచ్చారని, దానిని గౌరవిస్తున్నామని తెలిపారు.
కాంగ్రెస్పార్టీ హామీల అమలుపై ఎన్నికలకు ముందు డెడ్లైన్పెట్టిందని, ఆ గడువులోగా వాటిని అమలు చేయలేదు కాబట్టే ప్రశ్నిస్తున్నాం తప్ప తాము తొందరపడటం లేదన్నారు. పార్లమెంట్లో తెలంగాణ ఏకైక గొంతుక బీఆర్ఎస్మాత్రమేనని, కాంగ్రెస్, బీజేపీ ఎంపీల కన్నా రాష్ట్రం కోసం ఎక్కువ ప్రశ్నలు తామే అడిగామన్నారు. తెలంగాణ సమస్యలు ఢిల్లీలో పరిష్కరించాలంటే బీఆర్ఎస్ను ప్రజలు గెలిపించాలన్నారు. ఖమ్మం ఎంపీ టికెట్ఎవరికిచ్చినా గెలిపించుకుంటామన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పూర్వవైభవం వస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్అన్నారు.