కామారెడ్డిపై కేసీఆర్ ఫోకస్.. తనతో కలిసి పని చేయాలని సుభాష్​రెడ్డికి ఆహ్వానం

కామారెడ్డిపై కేసీఆర్ ఫోకస్.. తనతో కలిసి పని చేయాలని సుభాష్​రెడ్డికి ఆహ్వానం

హైదరాబాద్, వెలుగు: కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంపై కేసీఆర్​ ఫోకస్​ పెంచారు. అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతున్న ఆయన.. ఆ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నేతలను ప్రగతి భవన్​కు పిలిపించి మాట్లాడారు. కామారెడ్డి జిల్లాలోని జనగామకు చెందిన తిమ్మయ్యగారి సుభాష్​రెడ్డి, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో కేసీఆర్​శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కామారెడ్డిలో రూ.6 కోట్ల సొంత నిధులతో స్కూల్​ నిర్మించిన సుభాష్​ రెడ్డిని కేసీఆర్ ​అభినందించారు. 

రాజకీయాల్లో ఆయన సేవలు ఎంతో అవసరమని, కామారెడ్డి నియోజకవర్గంలో తనతో కలిసి పని చేయాలని ఆహ్వానించారు. కేసీఆర్​ ఆహ్వానంపై సుభాష్​ రెడ్డి సానుకూలంగా స్పందించారు. కామారెడ్డిలో కేసీఆర్​ కోసం పనిచేస్తానని తెలిపారు.