- ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి
- ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇందిరా శోభన్
హైదరాబాద్: కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్టం లో మద్యం ఏరులై పారుతోందని, లిక్కర్ మీద ఉన్న సోయి కేసీఆర్ కు ప్రజలపై లేదంటూ మండిపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇందిరా శోభన్. ప్రభుత్వానికి మద్యం పాలసీపై ఉన్న శ్రద్ధ మిగతా పాలసీలపై లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైన్స్, బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయని, అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం కన్నా నష్టమే ఎక్కువగా ఉందన్నారు. జనాలను తాగుడుకు బానిసలను చేస్తే.. తననెవరు ప్రశ్నించలేరు అని సీఎం కుట్రపూరితంగా మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తన సొంత ఇలకాలో ఓ అమ్మాయిపై అఘాయిత్యం జరిగితే ఇంతవరకు మంత్రి కేటీఆర్ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. విద్య, వైద్యం మీద దృష్టి పెడితే రాష్టం అభివృద్ధి చెందుతుందన్నారు. మద్యాన్ని నిషేదించాలని, గంజాయి, డ్రగ్స్ ని నియంత్రించాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం మీద దృష్టి పెడితే రాష్టం అభివృద్ధి చెందుతుందన్నారు.
మరిన్ని వార్తల కోసం: