- ఉద్యోగులకు 20 శాతం ఐఆర్ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీ ఆర్ఎక్కడికి పోయారో తెలియడం లేదని,15 రోజులుగా చీకట్లోనే ఉన్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్పాలన చూస్తుంటే తెలంగాణ ఎందుకు వచ్చిందని బాధగా ఉందన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగుల పాత్ర కీలకమని, అలాంటి వాళ్లపై సర్కారు వివక్ష చూపిస్తున్నదని మండిపడ్డారు. పీఆర్సీ కమిటీని ఆలస్యంగా వేయడమే కాకుండా ఐదు శాతమే ఐఆర్ఇవ్వడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు ఇరవై శాతం కన్నా ఎక్కువే ఇచ్చిందని గుర్తు చేశారు. పెరిగిన ధరలకు అను గుణంగా ప్రభుత్వం 20 శాతం ఐఆర్ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెం డింగ్లో ఉన్న మూడు డీఏలనూ వెంటనే విడుదల చేయాలన్నారు.
పింఛన్ విధానం రాష్ట్రాల ఇష్టమని కేంద్రం స్పష్టం చేసినా.. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లో ఓపీఎస్ను అమలు చేస్తున్నామని చెప్పారు. జోనల్ సిస్టం అస్తవ్యస్తంగా మారిందన్నారు.10 ఉమ్మడి జిల్లాల ఆధారంగా జోనల్ సిస్టమ్ను పునర్వ్యవస్థీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. 317 జీవోతో టీచర్లనూ ఇబ్బందులు పెడుతున్నదని, ఉపాధ్యాయ దంపతులు కలిసి సంసారం చేయలేని పరిస్థితి దాపురించిందన్నారు. పిల్లల భవిష్యత్ఏంటో అర్థంగాక ఓ టీచర్ ఆత్మహత్య చేసుకున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ వేస్తారో.. వెయ్యరో తేల్చి చెప్పాలని కేసీఆర్ను డిమాండ్ చేశారు.