కేసీఆర్ దళిత ద్రోహి....బండి సంజయ్

కేసీఆర్ దళిత ద్రోహి....బండి సంజయ్
  • కేసీఆర్ అంబేద్కర్ని అవమానించాడు

125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఎప్పుడు పెడ్తవ్ కేసీఆర్ ? అంటూ ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.  ట్యాంక్ బండ్ ఐమాక్స్ థియేటర్ దగ్గర 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనులను బీజేపీ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆరేళ్లు అయినా అంబేద్కర్ విగ్రహ పనులు ఎందుకు పూర్తి చేయడం లేదో సీఎం సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక మొట్టమొదట మోసం చేసింది దళితులనే అన్నారు. తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిని దళితుడినే చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారన్నారు. దళితులకు మూడెకరాల హామీ కూడా గాలికే పోయిందన్నారు. కేసీఆర్ మాయమాటలను దళితులే కాదు యావత్తు తెలంగాణ జనం నమ్మడం లేదన్నారు. . రాజ్యాంగాన్ని కూడా తిరగరాయాలనడం కేసీఆర్ బరితెగింపునకు నిదర్శనమన్నారు. 

ఇవి కూడా చదవండి...

ప్రభుత్వ స్కూళ్లల్లో కనీస సౌకర్యాలు లేవు... ఆకునూరి మురళి

కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు