కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా.. వాసాలమర్రికి సర్పంచా?

కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా.. వాసాలమర్రికి సర్పంచా?

కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రినా... వాసాలమర్రికి సర్పంచా అని అన్నారు కాంగ్రెస్ నేత మాధుయాష్కీ గౌడ్. కులమతాలకు అతీతంగా పాలిస్తామని రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన సీఎం.. ఒక గ్రామాన్ని ఎలా దత్తత తీసుకుంటారని ప్రశ్నించారు. TRS తెలంగాణ రాబందుల సమితిగా మరి రాష్ట్ర  ప్రజలను దోచుకుతింటుందన్నారు. ఏడేళ్లగా దళిత, గిరిజనులకు కేసీఆర్ అన్యాయం చేశారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇచ్చివుంటే ఆత్మగౌరవంతో బతికేవారన్నారు. దళిత ఓట్ల కోసమే దళిత బంధు తీసుకొచ్చారన్నారు. ఛలో ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.