కేసీఆర్,జానారెడ్డి మంచి దోస్తులు

కేసీఆర్,జానారెడ్డి మంచి దోస్తులు

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం పాలక పార్టీతో పాటు ప్రతిపక్షాలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. గెలుపు దీమా వ్యక్తం చేస్తూ ఇతర పార్టీలపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. సాగర్ ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్, నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి మంచి ఫ్రెండ్స్ అని అన్నారు. జానారెడ్డి.. సాగర్‌కు ఏం చేశారో.. ఏం చేయలేదనో గత ఎన్నికల్లో ఓడగొట్టారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు ఎందుకు పోటీ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను..టీఆర్‌ఎస్‌కు అమ్ముకున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకుండా అన్ని కబ్జాలు చేస్తున్నారన్నారు. ప్రజలు నిలదీస్తే తెలంగాణలో ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు విజయశాంతి.