కృష్ణా జలాలను కేసీఆర్, జగన్ కి అమ్మేశారు

కృష్ణా జలాలను కేసీఆర్, జగన్ కి అమ్మేశారు

కృష్ణా జలాలను కేసీఆర్, జగన్ కి అమ్మేశారన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్.   చెప్పిన పంటలు వేస్తేనే రైతు బంధు పథకం ఇస్తామనడం రైతులకు అన్యాయం చేయడమేనన్నారు. కేసీఆర్ మాటల వల్ల మొక్కజొన్న రైతులు మనస్తాపానికి గురయ్యారన్నారు. అన్ని రంగాల్లో అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ ఇప్పుడు వ్యవసాయ రంగంలో కూడా అవినీతి మొదలు పెట్టాడన్నారు. బీజేపీతో పెట్టుకుంటే టీఆర్ ఎస్ తుడిచిపెట్టుకు పోతుందన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి అభివృద్ధి విషయంలో శ్రద్ధ లేదన్నారు. మంత్రిగా జిల్లాకు ఆయన చేసిందేమీ లేదన్నారు. ఒవైసి ఓ దేశ ద్రోహి అన్నారు. ఎంఐఎం పార్టీ చట్ట వ్యతిరేక, దేశ ద్రోహ కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు.  వలస కార్మికుల విషయంలో కేసీఆర్ నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు.కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో మోడీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం  అదృష్టమన్నారు.

see more news

వలస కూలీలపై కేసులు ఎత్తేసి.. 15 రోజుల్లో సొంతూళ్లకు పంపండి

24 గంటల్లో 9987 కరోనా కేసులు..331 మంది మృతి

మేం మంచి దోస్తులం..మా మధ్య పోటీ పెట్టొద్దు