హైదరాబాద్: ఉద్యోగాల పేరిట కేసీఆర్ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రెడీ అవుతున్నారని, ప్రశాంత్ కిషోర్తో కలసి ఉద్యోగాల పేరుతో సరికొత్త డ్రామా షూరూ చేశారని బీజీపీ సీనియర్ లీడర్ విజయశాంతి మండిపడ్డారు. ఇటీవల అసెంబ్లీలో 89 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ నేపథ్యంలో బీజీపీ సీనియర్ లీడర్ విజయశాంతి స్పందించారు.
‘కేసీఆర్ సర్కార్ కేవలం 80వేల ఉద్యోగాలతో సరిపెట్టింది. సీఎం కేసీఆర్ గతంలో 4లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. ఇప్పుడేమో కేవలం 89 వేల ఉద్యోగాలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోని సీఎంకి ఇప్పుడే ఉద్యోగాల భర్తీ ఎందుకు గుర్తోచిందంటే.. ముందస్తు ఎన్నికలకు వెల్లబోతున్నారు. వారి ఓట్ల కోసం కొత్త ఉద్యోగాలంటూ కొత్త రాగం పాడుతున్నారు. ఏడాదిన్నర క్రితం 1.91 లక్షల ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికి ఆ ఖాళీలు 3 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు ప్రకటించిన 89 వేల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. 18 వేల మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్. ఇలాంటి నియంత దేశంలో ఎక్కడా లేరు. ఇన్నాళ్లూ కనీసం టెట్ కూడా నిర్వహించలేదు. కేసీఆర్ కి కాషాయ సెగ తగిలింది. దేశంలో బీజేపీ చేసిన అభివృద్ధిని చూసి భయపడి.. నక్క జిత్తుల వేషాలు వేస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరడం తట్టుకొలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేసీఆర్ నీ నాటకాలను ప్రజలు చూస్తూ ఊరుకోరు. వారే నీకు తగిన సమాధానం చెబుతారు’ అని విజయశాంతి ఘాటుగా విమర్శించారు.
కేసీఆర్ మరోసారి నిరుద్యోగులను మోసం చేయడానికి రెడి అవుతున్నాడు. ప్రశాంత్ కిషోర్ తో కలసి నిరుద్యోగులతో సరికొత్త డ్రామా షూరూ చేసిండు. నిరుద్యోగులు ఉద్యోగుల కోసం ఎంతగానో ఎదురుచుస్తున్నారు. కేసీఆర్ సర్కార్ కేవలం 80వేల ఉద్యోగాలతో సరిపెట్టింది. సీఎం కేసీఆర్ గతంలో 4లక్షలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడేమో కేవలం 80వేల ఉద్యోగాలంటూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి నిరుద్యోగులు ఆందోళనలు చేస్తుంటే చూస్తు ఊరుకున్న సీఎం సారుకి ఇప్పుడే ఉద్యోగాల భర్తీ ఎందుకు గుర్తోచిందంటే.. ముందస్తూ ఎన్నికలకు వెల్లబోతున్నాడు. వారి ఓట్లు కోసం కొత్త ఉద్యోగాలంటూ కొత్త రాగం పాడుతున్నాడు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఉద్యోగాలంటూ ఆర్భాటం చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం 1.91 లక్షల ఖాళీలున్నాయని బిశ్వాల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికి ఆ ఖాళీలు 3 లక్షలకు పెరిగాయి. ఇప్పుడు ప్రకటించిన 80 వేల ఉద్యోగాలకు వెంటనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. 18 వేల మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాల నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్. ఇలాంటి నియంత దేశంలో ఎక్కడా లేరు. ఇన్నాళ్లూ కనీసం టెట్ కూడా నిర్వహించలేదు. కేసీఆర్ కి కాషాయ సెగ తగిలింది. అందుకే పెద్ద దొరవారు దిగి వచ్చారు. దేశంలో బీజేపీ చేసినా అభివృద్ధిని చూసి భయపడి నక్క జిత్తుల వేషాలు వేస్తున్నాడు. నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరడం తట్టుకొలేక ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. కేసీఆర్ నీ నాటకాలను ప్రజలు చూస్తూ ఊరుకోరు. వారే నీకు తగిన సమాధానం చెబుతారు. విజయశాంతి
Posted by Vijayashanthi on Thursday, March 10, 2022
మరిన్ని వార్తల కోసం
దోచుకునెటోళ్లను వదలం
గోవా అసెంబ్లీకి మూడు జంటలు