కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలి..విజయశాంతి

కేసీఆర్ తన పదవికి రాజీనామా చేయాలి..విజయశాంతి
  • రాజేంద్రనగర్  భీం దీక్షలో పాల్గొన్న విజయశాంతి

భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా రాజేంద్రనగర్ లో బీజేపి భీం దీక్ష కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి అంబేద్కర్ రచించిన రాజ్యంగంలోని ఆర్టికల్ 3తోనే రాష్ట్రం ఏర్పడిందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ దళితులను మోసం చేస్తూనే ఉన్నారని, ఇక తన ఆటలు సాగవని హెచ్చరించారు. దేశ ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

ఇవి కూడా చదవండి..

దళితబంధుపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం..మంత్రి ఎర్రబెల్లి

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు