దళితబంధుపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం..మంత్రి ఎర్రబెల్లి

దళితబంధుపై ప్రతిపక్షాల తప్పుడు ప్రచారం..మంత్రి ఎర్రబెల్లి
  • దళితులను ధనవంతులను చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యం

దళితబంధుపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు. దళితులను ధనవంతులను చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యమని, దళితబంధుపై అసత్య ప్రచారం చేస్తున్నవారికి తగిన బుద్ధి చెప్పాలని మంత్రి కోరారు. రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు వక్రీకరించాయన్నారు. రాజ్యాంగాన్ని ఇంకా పటిష్టం చేసి  పేద వర్గాలకు న్యాయం చేయాలనేదే కేసీఆర్ ఉద్దేశమని మంత్రి తెలిపారు. దేశం మొత్తంలో అంబేద్కర్ను గౌరవించే ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు. డ్రైవర్లు, క్లీనర్లను ఓనర్లను చేస్తున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

ఇవి కూడా చదవండి..

 

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు

మోడల్ ఆత్మహత్యాయత్నం.. తెరపైకి మంత్రి పేరు