మోడల్ ఆత్మహత్యాయత్నం.. తెరపైకి మంత్రి పేరు

మోడల్ ఆత్మహత్యాయత్నం.. తెరపైకి మంత్రి పేరు

రాజస్థాన్‌లో ఓ మోడల్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. జోధ్‌పూర్‌లో ఓ మోడల్ హోటల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే దీని వెనుక హనీ ట్రాప్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. తాజాగా ఆమె ఆత్మహత్యాయత్నం వెనుక సంచలన నిజాలను వెల్లడించారు. రాజస్థాన్ రెవెన్యూ మంత్రిని ట్రాప్ చేయాలనే ఒత్తిడిని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. 

రాజస్థాన్ మంత్రి రాంలాల్ జాట్‌ను హనీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించి మోడల్‌ను బ్లాక్ మెయిల్ చేసిన ఈ కేసులు పొలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ఓ మహిళ హోటల్ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో & చికిత్స పొందుతోందని... డిప్యూటీ సీపీ భువన్ భూషణ్ యాదవ్ పేర్కొన్నారు. బాధితురాలు మోడలింగ్ కోసం అక్టోబర్ 2021 ఉదయ్‌పూర్‌కు వెళ్లి నిందితులైన అక్షిత్, దీపాలితో పరిచయం ఏర్పడిందన్నారు సీపీ. వాళ్లు ఇద్దరు మోడళ్లను తీసుకుని గత గురువారం ఏదో పని అని చెప్పి మంత్రిని కలిశారు. అనంతరం అతను ఉంటున్న సర్క్యూట్ హౌస్‌కు ఎదురుగా ఉన్న హోటల్లో దిగారు. అమ్మాయిలను కూడా అదే హోటల్లో ఉంచారు. 

అయితే ఆ ఇద్దరు అమ్మాయిల్లో ఒకమ్మాయి ఈ పనికి అంగీకరించలేదు. దాంతో ఆ అమ్మాయి నగ్నంగా ఉన్న వీడియోను చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆ యువతి తీవ్ర మానసిక ఒత్తడికి గురైంది. ఆందోళన తట్టుకోలేక ఆదివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. దీపిక, అక్షత్‌లను ప్రధాన సూత్రధారులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు అక్షిత్ హనీ ట్రాప్ ముఠాను నడుపుతున్నాడని, అంతకుముందు కూడా ఒక ప్రముఖ కేసులో బుక్ అయ్యాడు. ఈసారి కూడా మంత్రిని  బ్లాక్‌మెయిల్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడని జోధ్‌పూర్ సీపీ తెలిపారు. హనీ ట్రాప్ కేసులు, కుట్రలు రాజుల కాలం నుంచి ప్రారంభం అయ్యాయన్నారు రాజస్థాన్ మంత్రి ప్రతాప్ ఖచారియావాస్ . పూర్వం రాజుల్ని కూడా ఇలాగే చంపారన్నారు. కాబట్టి రాజకీయాల్లో ఈ కుట్రలు జరుగుతాయన్నారు. మంత్రిగారు మాత్రం ఏం చేయగలరు? తనకేమీ తెలియదని పేర్కొన్నారు.