హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్అధినేత, అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. 9 నెలల తర్వాత ఆయన సభ గడప తొక్కనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కేవలం రెండుసార్లే అసెంబ్లీకి వచ్చారు. చివరిసారిగా ఆయన ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన బడ్జెట్సెషన్కు హాజరయ్యారు. మార్చి 12న గవర్నర్ప్రసంగం రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. దాదాపు 40 నిమిషాలపాటు సభలో గడిపారు. ఆ తర్వాత మళ్లీ అసెంబ్లీ వైపు చూడలేదు. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్రిపోర్టుపై చర్చ సందర్భంగా ఆగస్టు 30, 31, సెప్టెంబర్ 1న నిర్వహించిన సెషన్కు ఆయన హాజరు కాలేదు.
పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ఇష్యూ నేపథ్యంలో.. ఇటీవల కేసీఆర్తెలంగాణ భవన్లో బీఆర్ఎస్నేతలతో సమావేశం నిర్వహించారు. ఇక తానే రంగంలోకి దిగుతానని, తోలు తీస్తానంటూ హెచ్చరించారు. ఈ క్రమంలోనే పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా నీళ్ల వాటాలు, గోదావరి జలాలపై చర్చించేందుకు ప్రభుత్వం సోమవారం నుంచి అసెంబ్లీ సెషన్ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షాలు అస్త్రాలను సిద్ధం చేసి పెట్టుకున్నాయి. సభలో పాల్గొనేందుకు కేసీఆర్ఆదివారం మధ్యాహ్నమే ఎర్రవల్లి ఫామ్హౌస్ నుంచి బయల్దేరి బంజారాహిల్స్ నందినగర్లోని తన నివాసానికి చేరుకున్నారు.
చర్చల్లో పాల్గొంటరా..?
అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్హాజరైనా.. కృష్ణా జలాలపై చర్చల్లో పాల్గొంటారా లేదా అనే దానిపై సందేహాలు కొనసాగుతున్నాయి. వాస్తవానికి సభను కనీసం ప్రతి ఆరు నెలలకోసారైనా నిర్వహించాలన్న రూల్ఉంది. దాని ప్రకారమే ఎమ్మెల్యేలు కూడా కనీసం ఆరు నెలలకోసారైనా వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది. చివరిసారిగా మార్చి 12న అసెంబ్లీకి హాజరైన కేసీఆర్.. ఆ తర్వాత ఆరునెలలకు ఆగస్టులో నిర్వహించిన సమావేశాలకు మాత్రం హాజరు కాలేదు. దీంతో సంతకం కూడా చేయలేదు.
