రేపో మాపో జైలుకు కేసీఆర్.. బీజేపీ చీఫ్ రామచందర్రావు

రేపో మాపో  జైలుకు కేసీఆర్.. బీజేపీ చీఫ్ రామచందర్రావు
  • ఆయనేమైనా ఫ్రీడం ఫైటరా? ​విచారణకు సహకరించాల్సిందే
  • గులాబీ పార్టీ మునిగిపోతున్న నౌక
  • సిట్​ఎంక్వైరీ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్​ఒక్కటవుతుంది
  • బీజేపీ స్టేట్​చీఫ్ రామ చందర్​రావు

హైదరాబాద్: ఫోన్​ట్యాపింగ్​కేసులో మాజీ సీఎం కేసీఆర్​ రేపో మాపో జైలుకు వెళ్తారని బీజేపీ స్టేట్​చీఫ్ రామ​చందర్​రావు అన్నారు. నాంపల్లిలోని పార్టీ ఆఫీసులో రామచందర్​రావు మాట్లాడుతూ ‘కేసీఆర్​ఏమైనా ఫ్రీడం ఫైటరా? సిట్​విచారణకు ఆయన సహకరించాలి. ఎంక్వైరీ తర్వాత కాంగ్రెస్, బీఆర్ఎస్​ఒక్కటవుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో బీజేపీ పోటీ చేస్తుంది. తెలంగాణలో పార్టీకి ఆదరణ పెరుగుతోంది. 

బీఆర్ఎస్​పై ప్రజల్లో నమ్మకం లేదు. గులాబీ పార్టీ ఒక మునిగిపోతున్న నౌకగా మారింది. ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామని కాంగ్రెస్ పెద్దగా హామీలు ఇచ్చింది. కానీ ఈ యూటర్న్‌తో పేదలు, మధ్యతరగతి ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేసింది. జనం ఇకపై తప్పుడు హామీలు, నకిలీ గ్యారంటీలకు మోసపోరు. మంచి పాలన, అభివృద్ధి, బాధ్యతాయుత పాలన కోసం తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నరు’ అని అన్నారు.

►ALSO READ | సిట్ నోటీసులసై కేసీఆర్ అభ్యంతరం.. విచారణ అధికారికి 6 పేజీల లేఖ