
గచ్చిబౌలి, వెలుగు : మైండ్ స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు చేపట్టనున్న మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు బుధవారం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావు ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రో పనుల శంకుస్థాపన అనంతరం రాష్ట్ర పోలీస్ అకాడమీలో సీఎం బహిరంగ సభ ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. (ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు)కేపీహెచ్బీ ఆర్వోబీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు ఐకియా అండర్ పాస్ మీదుగా వచ్చే వెహికల్స్ సైబర్ టవర్ జంక్షన్, సీవోడీ సిగ్నల్ వద్ద రైట్ టర్న్ తీసుకుని నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్స్, ఐటీసీ కోహినూర్ హోటల్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ మీదుగా బయోడైవర్సిటీ వైపు వెహికల్స్ను అనుమతించరు. కేపీహెచ్బీ ఆర్వోబీ నుంచి సైబర్ టవర్స్ ఫ్లై ఓవర్ మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే వెహికల్స్ సైబర్ టవర్స్ జంక్షన్, మెటల్ చార్మినార్, సీఐఐ జంక్షన్, కొత్తగూడ జంక్షన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. హైటెక్స్ నుంచి సైబర్ టవర్స్, బయోడైవర్సిటీ వైపు వచ్చే వెహికల్స్ సైబర్ టవర్స్, సీవోడీ సిగ్నల్ వద్ద రైట్ టర్న్ తీసుకుని నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్, ఎన్సీబీ రోడ్ మీదుగా వెళ్లాలి. సీఐఐ, టెక్ మహీంద్రా, డెల్ కంపెనీ రోడ్ నుంచి బయోడైవర్సిటీ, ఇనార్బిట్ మాల్ వైపు వచ్చే వెహికల్స్ టీసీఎస్ జంక్షన్ నుంచి లెఫ్ట్, సైబర్ టవర్స్ వద్ద రైట్ టర్న్ తీసుకుని సీవోడీ సిగ్నల్,నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్, ఐటీసీ రోడ్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కావూరి హిల్స్ నుంచి సైబర్ టవర్స్, కేపీహెచ్బీ ఆర్వోబీ నుంచి సైబర్ టవర్స్, సీవోడీ జంక్షన్, హైటెక్స్ జంక్షన్నుంచి సైబర్ టవర్స్, సైబర్ టవర్స్ నుంచి కొత్తగూడ జంక్షన్, టీసీఎస్ జంక్షన్ నుంచి సైబర్ టవర్స్, ఎన్ఐఏ నుంచి ఎస్బీఐ పర్వత్నగర్, నీరూస్ జంక్షన్నుంచి పర్వత్నగర్ వైపు వెళ్లే రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనుంది.
నార్సింగి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఇలా..(ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు)చేవెళ్ల నుంచి మొయినాబాద్ మీదుగా బండ్లగూడ జాగీర్, కాళీమందిర్, సన్సిటీ, రాజేంద్రనగర్, ఎయిర్పోర్టు వైపు వెళ్లే వెహికల్స్ గురు రాఘవేంద్ర హోటల్, టీఎస్పీఏ నార్సింగి రోటరీ, గచ్చిబౌలి మీదుగా లంగర్ హౌజ్ వైపు నుంచి వెళ్లాలి. గచ్చిబౌలి, శంకర్పల్లి నుంచి రాజేంద్రనగర్, బండ్లగూడ, కాళీమందిర్, మొయినాబాద్, చేవెళ్ల వైపు వచ్చే వెహికల్స్ నార్సింగి రోటరీ –1, తారామతి బారాదారి, టిప్పుఖాన్ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి మొయినాబాద్, చేవెళ్ల వైపు వచ్చే వెహికల్స్ హిమాయత్సాగర్ గ్రామం, టీఎస్పీఏ రోటరీ–2 మీదుగా వెళ్లాలి. శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కాళీమందిర్, బండ్లగూడ జాగీర్, సన్సిటీ, మొయినాబాద్, చేవెళ్ల వైపు వచ్చే వెహికల్స్ ఎగ్జిట్–17, ఎగ్జిట్– 1 నుంచి లేదా గచ్చిబౌలి ఎగ్జిట్– 19 నుంచి వెళ్లాలి. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కాళీమందిర్, బండ్లగూడ జాగీర్, సన్సిటీ, హైదరాబాద్ వైపు వెళ్లే వెహికల్స్రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ టోల్గేట్నుంచి బుద్వేల్ గ్రామం, కిస్మత్ పురా, కాళీమందిర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మొయినాబాద్ నుంచి హిమాయత్ సాగర్, టిప్పుఖాన్ బ్రిడ్జి మీదుగా టీఎస్పీఏ రోడ్, నార్సింగి నుంచి టీఎస్పీఏ సర్వీస్ రోడ్, ఓఆర్ఆర్ ఎగ్జిట్–18 అన్నీ టోల్స్ రద్దీగా ఉంటాయి.
భారీ వెహికల్స్ కు నో ఎంట్రీ
మాదాపూర్, నార్సింగి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో పోలీసులు సూచించిన రూట్లలో భారీ వెహికల్స్కు అనుమతి లేదు. రాజేంద్రనగర్ నుంచి కాళీమందిర్, టిప్పుఖాన్ బ్రిడ్జి నుంచి మొయినాబాద్, శంషాబాద్ ఓఆర్ఆర్ నుంచి కాళీమందిర్, గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి టీఎస్పీఏ(రాష్ట్ర పోలీస్ అకాడమీ), గచ్చిబౌలి సర్వీస్ రోడ్ నుంచి టీఎస్పీఏ, చేవెళ్ల, మొయినాబాద్ నుంచి టీఎస్పీఏ, కేపీహెచ్బీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, గచ్చిబౌలి, ఖాజాగూడ వైపు అనుమతించరు.