- సీఎం కేసీఆర్ బక్రీద్ విషెస్
హైదరాబాద్, వెలుగు: త్యాగాలతోనే సమాజ హితం సాధ్యమని, దాంతో ప్రాప్తించిన ప్రయోజనాలను ప్రజలకు అందించినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్పండుగ మానవాళికి అందిస్తుందని సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. బక్రీద్ను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు చెప్పారు.
ఈ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని వివరించారు. తమ ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పాటు పడుతున్నదని తెలిపారు. అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.