తన అకౌంట్లో హిట్లు పెద్దగా పడకపోయినా.. కీర్తి సురేష్ క్రేజ్ మాత్రం పెరుగుతోందే తప్ప తరగడం లేదు. దానికి కారణం.. ఆమె గొప్ప నటి కావడమే. ‘మహానటి’ తర్వాత ఆ స్థాయి పాత్ర దొరక్కపోయినా.. చేసిన ప్రతి క్యారెక్టర్తోటీ నటిగా తన స్థాయి ఏంటో ప్రూవ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు తన కెరీర్ని మరోసారి మలుపు తిప్పే క్యారెక్టర్ చేయబోతోందంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. నేషనల్ అవార్డ్ గెల్చుకున్న ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రాన్ని తీసిన సుధ కొంగర డైరెక్షన్లో కీర్తి నటించబోతోందట. ‘కేజీయఫ్’ ప్రొడ్యూసర్ విజయ్ కిరగందూర్ ఆ మధ్య సుధతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇదొక ఫిమేల్ సెంట్రిక్ మూవీ అట. కాస్త ఎమోషన్స్ ఎక్కువగా ఉండే క్యారెక్టర్ కావడంతో కీర్తిని తీసుకున్నారని అంటున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మాత్రం ప్యాన్ ఇండియా స్థాయిలో కీర్తి పేరు మారుమోగుతుంది. ప్రస్తుతం తమిళంలో ‘మామన్నన్’లో నటిస్తున్న కీర్తి, తెలుగులో దసరా, భోళాశంకర్ చిత్రాలు చేస్తోంది. త్వరలో బాలీవుడ్లోనూ అడుగుపెట్టబోతోందని సమాచారం.