కీర్తి సురేష్ కు ఏమైంది.. వైరల్ అవుతున్న ఫోటోస్

కీర్తి సురేష్ కు ఏమైంది.. వైరల్ అవుతున్న ఫోటోస్

కీర్తి సురేష్ కు ఏమైంది? మొఖంపై గాట్లతో ఉన్న ఆమె ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఆమె ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ఇంతకీ ఆ ఫోటో వెనకాల ఉన్నల అసలు విషయం ఏంటంటే.. ఆమె గతంలో సానికాయుధం అనే మూవీలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది కీర్తి. ఇందులో భాగంగా.. అప్పటి వర్కింగ్ స్టిల్స్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

 దానికి "ఈ ఫోటో సానికాయుధం మూవీలో ఒక స్టిల్. మురికిపట్టిన గోళ్ళు, హవాయ్ చెప్పులు, చిన్నపాటి చెవి రింగులు, మెటా డోర్ వ్యాన్, సుదలై సంగయ్య ప్రతీకారం, కొన్ని ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాలో అద్భుతమైన జ్ఞాపకాలను అందించారు డైరెక్టర్ అర్జున్ మాతేశ్వరన్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక సానికాయుధం సినిమాలో ఆమె పాత్ర చాలా కొత్తగా, క్రూయల్ గా ఉంటుంది. తనని సామూహికంగా అత్యాచారం చేసిన వారిపై రీవెంజ్ తీర్చుకునే అమ్మాయిగా ఆమె నటన అద్భుతంగా ఉంటుంది.

అందుకే ఆ సినిమా జ్ఞాపకాల నుండి కీర్తి బయటకు రాలేకపోతోంది అంటూ ఆ ఫోటోస్ చూసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కీర్తి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న  మూవీ భోళా శంకర్ లో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె చిరుకి చెల్లెలుగా కనిపించనుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.