లైంగిక వేధింపుల కేసులో ఉన్ని ముకుందన్కు కేరళ హైకోర్టు షాక్

లైంగిక వేధింపుల కేసులో ఉన్ని ముకుందన్కు కేరళ హైకోర్టు షాక్

మలయాళ నటుడు ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. తనపై ఉన్న లైంగిక వేధింపుల కేసులో నిర్దోషిగా ప్రకటించాలంటూ ఉన్ని ముకుందన్ వేసిన పిటిషన్‌ను హైకోర్ట్ తిరస్కరించింది. ఫిబ్రవరి 2023లో ఈ కేసుపై విధించిన స్టేను తాజాగా కేరళ హైకోర్టు ఎత్తివేసింది. ఇదిలా ఉండగా ఈ కేసులో సెటిల్‌మెంట్‌ కుదిరిందని, ఇక కోర్ట్ వాదనలు ఉండకపోవచ్చనే ఊహగానాలు కూడా వచ్చాయి. ఆ రూమర్స్ కు హైకోర్ట్ పులిస్టాప్ పెట్టేసింది. 

ఇక 2017లో ఒక సినిమా ప్రాజెక్ట్ గురించి కోసం కొచ్చిలోని ఎడపల్లిలోని తన నివాసానికి వచ్చిన ముకుందన్.. తనపై దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదులో చేశారు. కానీ ఆమె ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. అంతేకాకుండా ఆమెపై పరువు నష్టం దావా కేసును కూడా దాఖలు చేశాడు. కేసు సెటిల్‌మెంట్‌ కోసం ఆమె రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని కూడా ఆరోపించాడు. ఇందులో భాగంగానే ఉన్ని ముకుందన్ ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశాడు. కానీ హైకోర్ట్ ఉన్ని ముకుందన్ కు షాకిచింది. 

దీంతో తనను నిర్దోషిగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టుకు వెళ్లాడు. ఇక తాజాగా మరోసారి ఉన్ని ముకుందన్ కు కేరళ హైకోర్టు షాకిచ్చింది