శబరిమల యాత్రికుల బస్సు బోల్తా.. 13మందికి గాయాలు

శబరిమల యాత్రికుల బస్సు బోల్తా.. 13మందికి గాయాలు

40 మంది శబరిమల యాత్రికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 13 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కొట్టాయం జిల్లా ఎరుమేలి సమీపంలోని కనమల వద్ద అక్టోబర్ 18న తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు.

"గాయపడిన నలుగురు యాత్రికులను కొట్టాయంలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. నలుగురిని జనరల్ ఆసుపత్రికి తరలించారు. మరికొందరు ప్రమాద బాధితులను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు" అని అధికారులు తెలిపారు. పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలార్‌కు చెందిన యాత్రికులు కొండ పుణ్యక్షేత్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు వాహనంలో 40 మంది యాత్రికులు సహా 43 మంది ఉన్నారని అధికారులు తెలిపారు.