కిషన్​రెడ్డి, డీకే అరుణకు కీలక బాధ్యతలు

కిషన్​రెడ్డి, డీకే అరుణకు కీలక బాధ్యతలు
  • రాష్ట్రపతి ఎన్నికల మేనేజ్​మెంట్ కమిటీలో చోటు
  •  14 మందితో బీజేపీ లిస్ట్ విడుదల

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు బీజేపీ వేసిన కమిటీలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణకు మెనేజ్మెంట్ కమిటీలో చోటు కల్పించింది. అలాగే, పార్టీ స్టేట్ ఇంచార్జ్​గా ఉన్న తరుణ్ చుగ్​కు కూడా చాన్స్ ఇచ్చింది. ఈ మేరకు 14 మందితో మేనేజ్మెంట్ కమిటీ జాబితాను బీజేపీ హైకమాండ్ శుక్రవారం విడుదల చేసింది. ఈ కమిటీకి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీలు వినోద్ తావ్డే, సిటీ రవిలు కో కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.