- రాష్ట్రపతి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీలో చోటు
- 14 మందితో బీజేపీ లిస్ట్ విడుదల
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణకు బీజేపీ వేసిన కమిటీలో తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణకు మెనేజ్మెంట్ కమిటీలో చోటు కల్పించింది. అలాగే, పార్టీ స్టేట్ ఇంచార్జ్గా ఉన్న తరుణ్ చుగ్కు కూడా చాన్స్ ఇచ్చింది. ఈ మేరకు 14 మందితో మేనేజ్మెంట్ కమిటీ జాబితాను బీజేపీ హైకమాండ్ శుక్రవారం విడుదల చేసింది. ఈ కమిటీకి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. నేషనల్ జనరల్ సెక్రటరీలు వినోద్ తావ్డే, సిటీ రవిలు కో కన్వీనర్లుగా వ్యవహరించనున్నారు.