కేజీబీవీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కేజీబీవీలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని  కేజీబీవీలతో పాటు అర్బన్​ రెసిడెన్షియల్​(యూఆర్​ఎస్​) స్కూల్స్​లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను  కోరుతున్నామని డీఈఓ సోమశేఖర శర్మ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్పెషల్​ఆఫీసర్​తో పాటు పీజీ సీఆర్టీ, సీఆర్టీ, పీఈటీల పోస్టులను తాత్కాలిక కాంట్రాక్ట్ పద్దతిన భర్తీ చేయనున్నట్టు తెలిపారు. కేజీబీవీల్లో స్పెషల్​ఆఫీసర్​ పోస్టు, సీఆర్టీ –15, పీజీసీఆర్టీ –52 పోస్టులకు సబ్జెక్ట్​ల వారీగా దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. కేజీబీవీల్లో మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. అర్హులైనవారు 26వ తేదీ సాయంత్రం 5గంటలలోపు పాఠశాల విద్యాశాఖ వెబ్​సైట్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉందన్నారు. పూర్తి వివరాలకు 8106651256నెంబర్​లో సంప్రదించాలన్నారు.