‘గమనిక : ప్రమాదం ముందుంది’

‘గమనిక : ప్రమాదం ముందుంది’

కన్నడ సినిమా స్థాయిని పెంచిన సినిమా ‘కేజీయఫ్’. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌‌‌‌లో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ మూవీ సెకెండ్ పార్ట్‌‌‌‌ ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఈలోపు అప్పుడప్పుడు ఓ అప్‌‌‌‌డేట్‌‌‌‌ని విడుదల చేస్తూ అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. నిన్న యశ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌తో విషెస్ చెప్పారు‌‌‌‌. ఇందులో యశ్ చాలా అగ్రెసివ్‌‌‌‌గా ఉన్నాడు. 

‘గమనిక : ప్రమాదం ముందుంది’ అనే డేంజర్ బోర్డ్‌‌‌‌ని తన ముందు పెట్టడం చూస్తే తన క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ మొదటి చాప్టర్‌‌‌‌‌‌‌‌లో కంటే డేంజరస్‌‌‌‌గా ఉంటుందని అర్థమవుతోంది. కరోనా వల్ల ఇప్పటికే చాలా సినిమాలు వాయిదా పడుతున్నప్పటికీ, తమ సినిమా మాత్రం ఏప్రిల్ 14న రావడం ఖాయమని ఈ సందర్భంగా మరోసారి కన్‌‌‌‌ఫర్మ్ చేశారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌‌‌‌. సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.